సమాధి నుండి లేచి నేరుగా 'పోలీస్ స్టేషన్'కి వెళ్లిన మహిళ!

ఏంటి? సమాధి నుండి మహిళ లేచిందా? అసలు ఇది జరిగేనా? ఒకవేళ జరిగితే ఎక్కడ ? ఎప్పుడు జరిగింది ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవును.

నిజంగానే జరిగింది.

కానీ మన దేశంలో కాదు ఉక్రేయిన్‌లో ఈ దారుణమైన ఘటన జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ 57 మహిళను ఆమె ఇద్దరు సోదరులు బ్యాట్ తో కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఆమె సమాధి ఆమె తొవ్వుకునేలా చేసి ఆమెను పాతి పెట్టి పోయారు.

అయితే వారు అనుకున్నట్టు ఆమె చావలేదు.చచ్చినట్టు నటించింది.

దీంతో ఆ మహిళా సమాధి నుండి బయటకు వచ్చింది.అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది.

Advertisement

అయితే శరీరం అంత గాయాలతో.కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.కోలుకున్న అనంతరం ఆమె నుండి వివరాలు సేకరించారు.

దీంతో ఆమె జరిగిన విషయం మొత్తం చెప్పి ఇలా స్పందించింది.నా సమాధిని నాతోనే తవ్వించారు.

నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించారు.నన్ను గోతిలోకి తోసిన తర్వాత నా ముఖాన్ని చేతులతో అడ్డుపెట్టుకుని ఊపిరి తీసుకోడానికి వీలుగా కొంత చోటుని ఏర్పాటు చేసుకున్నా.

దాని వల్ల నేను ప్రాణాలతో బ్రతికాను’’ అని తెలిపింది.దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు ఆమె సోదరుల కోసం గాలిస్తున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు