పరాయి స్త్రీ మోజులో పడి కుటుంబానని నిర్లక్ష్యం చేస్తున్న భర్త ఓ మహిళ తగిన శాస్త్రి చేసింది.భర్తలంతా ఉలిక్కిపడేలా చేసింది ఆ ఇల్లాలు.
తనలో కట్టలు తెంచుకున్న కోపం, ఆవేశం, ఆవేదనకు ఆ భర్త గురికాక తప్పలేదు.ఈ ఘటన హైదరాబాద్ శివారు దరియాబాగ్ లో జరిగింది.
విజయవాడ్ సింగ్ నగర్ కు చెందిన గిరిధర్ లాల్, రేణుక దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.విజయవాడలో మాంసం వ్యాపారం చేస్తూ గిరిధర్ లాల్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే పిల్లల చదువుల నిమిత్తం మూడున్నరేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చారు.జియాగూడలోని ఓ కబేళాలో పని చేస్తున్నాడు.
హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సక్రమంగానే ఉన్న గిరిధర్ లాల్. తర్వాత పరాయి స్త్రీల మోజులో పడ్డాడు.
వారి వద్దే ఉంటూ ఇంటికి కూడా రావడం మానేశాడు.అలా ఐదు నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన గిరిధర్ లాల్.
మూడ్రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చిన భర్తపై భార్య అరిచింది.
పరాయి స్త్రీ మోజులో పడి ఇంటిని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహించి దానిని తీర్చుకుంది.దంపతుల మధ్య గత మూడ్రోజులుగా ఈ విషయంపై వాగ్వాదం జరుగుతోంది.
భర్త తీరు మార్చుకోకపోవడం, తనను ఇష్టమొచ్చినట్లు తిడుతుండటంతో ఆ మహిళకు పట్టరాని కోపం వచ్చింది.తనలో గూడు కట్టుకున్న ఆవేశం, ఆవేదనను భర్తపై చూపించింది.
వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను భర్త తలపై పోసింది.గిరిధర్ లాల్ తల, ఛాతీ, చేతులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.