అగ్రరాజ్యంలో దారుణం.. గర్భిణిని చంపి కడుపు కోసి?

పట్టపగలే ఒళ్ళు గగుర్లు పొడిచే అతి భయంకరమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అమ్మతనం పొందాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు.

తనకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకొని ఆడించాలని ఆ తల్లి ఎన్నో కలలు కనింది.అయితే ఆ కలను కేవలం కలగానే మార్చేసింది.

ఎవరు ఊహించనటువంటి దారుణానికి ఓమహిళా ఆ గర్భిణీ పట్ల వ్యవహరించింది.టైలర్ పార్కర్ (27) అనే మహిళ అత్యంత కిరాతకంగా ఆ గర్భిణీ మహిళను చంపి కడుపు కోసి తన బిడ్డను ఎత్తుకెళ్లింది.

ఈ హృదయ విదారక ఘటన నడిరోడ్డుపై అగ్రరాజ్యంలో జరగడం వివాదాస్పదంగా మారింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.

Advertisement

టైలర్ పార్కర్ అనే మహిళ గతంలో ఎన్నో నేరారోపణలు చేసిన కారణంగా ఆమెను టెక్సాస్ జైలులో ఖైదీ గా బంధించారు.అయితే గత గురువారం రోజున 5 మిలియన్ డాలర్ల అపరాధం తో బెయిలుపై పార్కర్ బయటకు వచ్చింది.

నేరారోపణ చరిత్ర ఉన్న ఈ మహిళ బయటకు రావడంతోనే అత్యంత ఘోరమైన పనికి పాల్పడింది.ఓ నిండు గర్భిణిని చంపి ఆమె కడుపు కోసి అందులో నుంచి బిడ్డను తీసుకెళ్ళింది.

అయితే బిడ్డ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆ బిడ్డను తన బిడ్డగా చెప్పి ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది.అయితే అప్పటికే ఆ బిడ్డ ప్రాణాలను కోల్పోయింది.

ఆమె వ్యవహరించిన తీరు, బిడ్డ పరిస్థితి చూసిన డాక్టర్లకు ఆమెపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆ మహిళను గట్టిగా విచారించగా, జరిగిన సంఘటన మొత్తం ఆమె పోలీసులకు వివరించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

పార్కర్ ఈ నిజం ఒప్పుకోవడం తో పోలీసులు ఆమెను మహిళపై కిడ్నాప్, హత్య ఆరోపణలపై పార్కర్ ను అరెస్టు చేసి మరలా జైలుకు పంపించారు.అయితే చనిపోయిన మహిళ డెడ్ బాడీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

పార్కర్ నివాసముంటున్న ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆ మహిళ శవం కనిపించడంతో, పార్కర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

తాజా వార్తలు