బిగ్ బాస్ 5 నర్మద ఎవరో తెలిసిపోయింది.. మోనాల్ ను మించిపోయేలా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఒక కంటెస్టెంట్ ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ, ఏడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్3లో శివజ్యోతి కన్నీళ్లతో వార్తల్లో నిలవగా బిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్ ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 4కు నర్మదగా మోనాల్ పేరును సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే సీజన్ 5లో కూడా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేని కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు.

హమీదా అనే కంటెస్టెంట్ సీజన్ 5లో మోనాల్ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.ఎలిమినేషన్ కు నామినేషన్స్ సమయంలో హమీదా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

తెలుగులో హమీదా సాహసం చేయరా ఢింభకా అనే చిన్న మూవీలో హమీదా నటించారు.బిగ్ బాస్ షోకు ఎంపికైన సెలబ్రిటీల జాబితాలో సైతం హమీదా పేరు వినిపించలేదు.

Advertisement

ప్రేక్షకుల్లో పెద్దగా పాపులారిటీ లేని హమీదా బిగ్ బాగ్ హౌస్ లో ఎన్ని వారాలు కొనసాగుతారో చూడాల్సి ఉంది.ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టెంట్లలో హమీదా కూడా ఉన్నారు.

చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే షోగా బిగ్ బాస్ షో పేరును సొంతం చేసుకుంది.హమీదా కంటి నుంచి నర్మదా నదిలా కన్నీళ్లు వస్తుండటం గమనార్హం.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చిన కంటెస్టెంట్లు ఎక్కువ వారం హౌస్ లో కొనసాగారు.

ఈ విధంగా ఏడ్చిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగారు.జశ్వంత్ పడాల, సిరి హన్మంత్, రవి, నటరాజ్ మాస్టర్, షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ ద్వారా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.షణ్ముఖ్ మరింత యాక్టివ్ అయితే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు