ఏనుగులు చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తుంటాయి.వాటికి అడ్డువచ్చిన వాటిని తొక్కుకెళ్లడమే ఇక.
కానీ ఒక్కోసారి ఇవి చేసే పనులు భయంగా, కాస్త విచిత్రంగా ఉంటాయి.రోడ్డు దాటుతున్నప్పుడు ఏవైనా వాహనాలు, మనుషులు అడ్డు వస్తే ఇక అంతే సంగతులు.
వాటిని పక్కకు తోసేస్తూ ముందుకు కదులుతుంటాయి.భారీ కాయం ఉండే ఏనుగులు వస్తున్నాయంటే అలా చూస్తూ ఉండి పోవడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.
తమిళనాడులో ఓ ఏనుగు చేసిన ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఆ గజరాజుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.అసలు ఆ ఏనుగు ఏం చేసిందంటే.అది తమిళనాడులోని ఈరోడ్.
ఆ రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.అప్పుడే అక్కడికి ఓ ఏనుగు వచ్చింది.
ఓ ట్రక్కను అడ్డగించింది.ఆ ట్రక్కు చెరకు లోడుతో వెళ్తుండటం గమనించిన ఆ గజ రాజు… దర్జాగా ఆ చెరకు గడలను తీసుకుంది.

కావాల్సినంత తిన్న తర్వాత మెల్లిగా అక్కడి నుండి వెళ్లి పోయింది. ఏనుగు అలా చెరకు గడలు తీసుకుంటున్నప్పుడు ఆ డ్రైవర్ ఏమీ చేయలేని పరిస్థితి.అలాగే కదలకుండా కూర్చున్నాడు.వాహనాన్ని అలాగే ఉంచేశాడు.దీంతో అసనూర్ సమీపంలోని సత్య మంగళం – మైసూర్ హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.ఏనుగు ఇలా చెరకు గడలను తీసుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.