త్రివిక్రమ్ కి వేణు కి మధ్య గొడవ ఎందుకు జరిగిందంటే..?

విజయ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన స్వయంవరం( Swayamvaram _ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు హీరో వేణు ఆయన చేసిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడం తో ఆయన టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు.

వరుస సక్సెస్ లు కూడా అందుకున్నాడు.

అయితే ఈయన చేసిన స్వయంవరం, చిరునవ్వుతో సినిమాలకి రైటర్ గా చేసిన త్రివిక్రమ్ చాలా పెద్ద డైరెక్టర్ గా ఎదిగిన విషయం మనందరికి తెలిసిందే.అయితే అప్పట్లో వీళ్లిద్దరి మద్య మంచి సానిహిత్యం ఉండేది దానితోనే త్రివిక్రమ్( Trivikram Srinivas ) డైరెక్షన్ చేసిన మొదటి సినిమా అయిన నువ్వే నువ్వే సినిమాలో హీరోగా వేణు ని చేయమన్నడట అప్పుడు ఆయన వేరే సినిమాలకి కమిట్ అయి ఉండటం వల్ల అది కుదరలేదు అలాగే తన తరువాత సినిమా అయిన అతడు లో కూడా సోనూసూద్ పాత్రని చేయమని వేణు ని అడిగాడట త్రివిక్రమ్ అయితే అది కొంచం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం తో దాన్ని చేయడానికి వేణు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.

ఇక అప్పటి నుండి వీళ్లిద్దరి మద్య పెద్దగా కాంటాక్ట్ కూడా లేదట ఎందుకంటే అంత మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చిన కూడా వేణు చెయ్యను అని చెప్పడంతో త్రివిక్రమ్ హర్ట్ అయినట్లు తెలుస్తుంది అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకు వేణు ని తన సినిమాలో తీసుకునే ప్రయత్నం చేయలేదు త్రివిక్రమ్.

ఇక ఇది ఇలా ఉంటే ఆ తరువాత ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసిన వేణు కెరీర్ లో హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరేళితే, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.తోమిదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వైపు చూసిన వేణు రవితేజ తో కలిసి రామ రావు ఆన్ డ్యూటీ( Ramarao on Duty ) సినిమాను చేసారు.తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న వేణు తన కెరీర్ లో చేసిన తప్పులను, అలాగే తన వ్యక్తిగత విషయాలను చెప్పారు.

Advertisement

ఇక ప్రస్తుతం ఆయన కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తూ చాలా బిజీ గా తన కెరియర్ ను గడుపుతున్నాడు.అలాగే ఇంక కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లో కూడా ఆయనకి అవకాశాలు వస్తున్నాయి అనే చెప్పాలి.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు