నందమూరి కుటుంబంలో ఇంత మంది హీరోలు ఉండగా కేవలం తారక రత్న విషయంలోనే ఎందుకు అభిమానులు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అనే ప్రశ్న సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది.ఇండస్ట్రీ లో చాల మంది హీరో లు చిన్న తనం లో కన్ను మూసారు, పైగా నందమూరి కుటుంబం లో ఇదేమి తొలి మరణం కాదు కానీ తారక రత్న కు ఇంత ప్రియరిటి అటు మీడియా ఇటు జనాలు ఇవ్వడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయ్.
తారక రత్న మంచి మనసు గురించి ఇప్పుడు చాల మంది మాట్లాడుతున్నారు.నందమూరి కుటుంబంలో ఇంత మంది ఉన్నప్పటికీ మేము మా బ్లడ్, మా బ్రీడ్ అనే అనుకుంటూ ఉంటారు.
చెప్తే ఒప్పుకోరు కానీ ఇప్పుడు ప్రెజెంట్ జెనరేషన్ నందమూరి హీరోలకు ఉన్న అహంభావం గురించి అందరికి తెలుసు.అలంటి అహభావం ఏ రోజు తారక రత్న లో చూడలేదు.
ఎప్పుడు నవ్వుతు ఉంటూ అందరిని నవ్వుతు పలకరిస్తూ ఉండేవాడు.
కుటుంబం అంత కూడా దూరం పెట్టిన కూడా ఏ రోజు ఎవరి పైన కోపం తెచ్చుకోలేదు.మీడియా కి ఎక్కి తనకు ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పుకోలేదు.అన్ని తన మనసులోనే పెట్టుకున్నాడు.
పైగా సినిమాలు ఇవ్వండి అని ఎవరిని అడిగింది కూడా లేదు.చాల మంది తెలుగు హీరోలకు కుటుంబ నేపధ్యం ఉంటె వచ్చే తాలూకా ఆ పొగరు, గర్వం ఏమాత్రం లేని మనిషి తారక రత్న.
అందుకే బాలకృష్ణ మొదటి నుంచి తారక రత్న ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు.
ఇక ప్రస్తుతం అంతా ముగిసిపోయింది.అందరు ఎవరు ఇంటికి వారు వెళ్లిపోయారు.అలేఖ్య రెడ్డి మరియు ఆమె పిల్లలు మాత్రం వారింట్లో ఒంటరిగా ఉండిపోవాలి.
పైగా పెద్ద పాపా మినహా మిగతా వారికి లోకం కూడా తెలియని పసి వయసు.తారక రత్న మృత దేహం వద్ద కొడుకు కి బ్రెడ్ తినిపిస్తూ అలేఖ్య కనిపిస్తన్న దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ చిన్నారి పిల్లలకు తండ్రి చనిపోయిన విషయం కూడా తెలియదు.వారికి ఊహ వచ్చే వరకు తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తారు.ఎంత డబ్బు ఉన్న నాన్న మాత్రం రాడుకదా.