Maha Shivaratri : మహా శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని శివపూజ భజన లీలా, శ్రవణా దులతో మేల్కొల్పి తను శివుడై, సర్వం శివ స్వరూపంగా భావించి దర్శించడమే నిజమైన జాగరణమని పండితులు చెబుతున్నారు.

అయితే ఇలా చేయడం ఇలా చేస్తే, శివపూజలో( Shivapooja ) సాయు జ్యం, శివభజనలో సామీప్యం, శివభక్తులతో కూడి, శివ విషయాలు ప్రసంగించుటలో సలోక్యం, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని సాక్షాత్తు జగద్దురువు ఆదిశంకరాచార్యులు( Jagadguru Adishankaracharya ) వారు తెలిపారు.

అలాగే కడుపులో విషతుల్యమైన ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.అవి శరీరారోగ్యం పై ప్రభావం చూపించకుండా ఉండడానికి ఉపవాసం చేసిన వారికి జాగరణ కూడా చాలా ముఖ్యమైనది అని తెలిపారు.

అయితే మర్నాడు మిగతాహారంతో ఉపవాసం( Fasting ) విరమించిన తర్వాత కూడా వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు.రెండు పుటలైన ఆహారం( Food ) కచ్చితంగా తీసుకోవాలి.అంతేకాకుండా జాగరణమంటే మన గురించి మనం మేలుకొని( Awake ) ఉండడం అని అర్థం.

అయితే జాగరణను సంపూర్ణ ఆరోగ్యవంతులే కచ్చితంగా చేయాలి.జాగరణ మర్నాడు విశ్రాంతిగా గడపడం చాలా అవసరం అని చెప్పవచ్చు.

Advertisement

ఎందుకంటే జాగరణ సమయంలో కనీసం ఒక్క నిమిషము కూడా నిద్రపోకూడదు.

అలాగే శరీరం నిద్ర లేక ఎంతగానో అలసిపోయి ఉంటుంది.కాబట్టి ఈ జాగరణ మర్నాడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.అంతేకాకుండా ఉపవాస జాగరణలు చేసే వారు మితి మీరిన శారీరక శ్రమకు కూడా దూరంగా ఉండాలి.

అంతే కాకుండా డ్రైవింగ్ లాంటి ఏకాగ్రత కూడా అత్యవసరం అయ్యే పనులకు కూడా విశ్రాంతి తర్వాతి ఉపక్రమించాలి.ఇక జాగరణ సమయంలో మానసిక ఉద్వేగాలనిపించే వినోద కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 100 రోజుల ఫంక్షన్ చేసుకోడానికి.. అభిమానులు ఎన్నేళ్లు వెయిట్ చేశారో తెలుసా?
Advertisement

తాజా వార్తలు