ఇండియన్ స్పైసెస్ లో పసుపు ఒకటి.పసుపును గోల్డెన్ స్పైస్ అని కూడా పిలుస్తారు.
భారతీయ వంటకాల్లో పసుపు ప్రధానమైనది.రుచి మరియు రంగుకు మాత్రమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా పసుపు( Turmaric ) ప్రసిద్ధి చెందింది.
యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు పసుపు పవర్ హౌస్ లాంటిది.రోజూవారీ ఆహారంలో పసుపును చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది.జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.
అలాగే పసుపు కర్కుమిన్ ( Curcumin )అనే బయోయాక్టివ్ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది.ఇది నొప్పి నివారిణి గా పనిచేస్తుంది.అందువల్ల రెగ్యులర్ డైట్ లో పసుపు ఉంటే కండరాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు దూరం అవుతాయి.పసుపులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే మరియు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి.
క్యాన్సర్ ( Cancer )ప్రమాదాన్ని తగ్గిస్తాయి.మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.కొంతమంది వ్యక్తులు దాని వినియోగాన్ని నివారించాలి లేదా పరిమితం చేయాలి.ఆ కొంతమంది ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మూత్రపిండాలు లేదా పిత్తాశయం రుగ్మతలు( Gallbladder disorders ) ఉన్న వ్యక్తులు పసుపుకు దూరంగా ఉండాలి.కీమోథెరపీ చేయించుకుంటున్న వారు పసుపు తీసుకోకూడదు.పసుపు గర్భాశయ సంకోచాలను కూడా ప్రేరేపిస్తుంది.
అందువల్ల గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు పసుపును ఎవైడ్ చేయడం మంచిది.

అధిక మోతాదులో పసుపు తీసుకుంటే ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.ఒకవేళ మీరు ఆల్రెడీ ఐరన్ లోపంతో బాధపడుతుంటే పసుపు తీసుకోవడం మానుకోండి.అంతేకాకుండా యాంటీ డయాబెటిక్ మందులు తీసుకునే వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు, కాలేయం లేదా పిత్త వాహిక సమస్యలు ఉన్న వ్యక్తులు, రక్తం గడ్డ కట్టడానికి మందులు వాడుతున్నవారు కూడా పసుపుకు దూరంగా ఉండమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.