బ్రో నైజం రైట్స్ ఎవరు దక్కించుకున్నారు...

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయి దరం తేజ్ హీరోలుగా చేస్తున్న బ్రో సినిమా ( Bro movie )మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలను భారీ స్థాయి లో పెంచేసింది.

ఇక ఈ సినిమా కి సముద్రఖని డైరెక్షన్ చేయడం కూడా చాలా ప్లస్ అవుతుంది అలాగే ఈ సినిమా స్టోరీ ని చాలా వరకు గురూజీ త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల కి నచ్చేలా చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మొత్తంగా 100 కోట్లకు పైగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది.ఇక దాదాపు అన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ క్లోజ్ అయ్యే దశకు వచ్చేసింది.

ఇక నైజాం ఏరియాలో నిన్న మొన్నటి వరకు కూడా బాగానే చర్చలు జరిగాయి.

మొదట పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 37 కోట్ల వరకు కోట్ చేసింది.ఇక దిల్ రాజు అయితే 30 కోట్ల వరకు సెట్ అయితే చేజిక్కించుకోవాలని అనుకున్నాడు.పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఎక్కువగా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు.

Advertisement

అయితే ఈసారి మాత్రం బ్రో సినిమా విషయంలో ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు.ఇక మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ 33 కోట్ల రేంజ్ లో ఈ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.

ఈ సినిమా సక్సెస్ అనేది పవన్ కళ్యాణ్ కంటే కూడా సాయి ధరమ్ తేజ( Sai Dharam Tej ) కి చాలా ముఖ్యం ఎందుకంటే రీసెంట్ గా విరూపాక్ష సినిమా( Virupaksha ) తో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ ఈ సినిమా తో మరో హిట్ అందుకుంటే ఇక ఇండస్ట్రీ లో వరుస హిట్లు కొట్టిన హీరోగా ముందుకు దుసుకెళ్లవచ్చు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు