దేశ రాజధాని ఢిల్లీ వరదలతో విలవిలలాడుతోంది.క్రమ క్రమంగా యమునా నదీకి వరద ప్రవాహం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.ఢిల్లీలో ఆదివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
అదేవిధంగా అత్యవసర విధులు నిర్వహించే వారు మినహా మిగతా ఆఫీస్ కార్యక్రమాలు అన్నీ ఇంటి నుంచే నిర్వహించుకోవాలని సూచించింది.ఔటర్ రింగ్ రోడ్డును మూసివేసిన అధికారులు ఢిల్లీలో భారీ వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.
మరోవైపు వరద బాధితుల కోసం ఆప్ ప్రభుత్వం షెల్టర్స్ ను ఏర్పాటు చేసింది.