వైరల్ వీడియో: పట్టాలు దాటుతూ ట్రైన్ కి బలైయిపోయిన మహిళ..!

ఈ మధ్య కాలంలో చాలామంది బయటకు వచ్చే సమయంలో వారి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి చెవిలో ఇయర్ ఫోన్స్ వినియోగించడం మరీ ఎక్కువగా మారింది.

ఒక్కోసారి ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా పక్కన ఏం జరుగుతుంది అన్న విషయాలు కూడా గుర్తుంచుకోకుండా రోడ్లపై నడిచేస్తుంటారు.

ఇలా చేయడం ద్వారా అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మరొకటి పునరావృతం అయింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఎవరి తప్పుకు వారే బాధితులు అని చెప్పుకునే ఎలా జరిగింది ఈ సంఘటన.

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ దారుణ సంఘటన జరిగింది.ఓ మహిళ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది.

Advertisement

అయితే అదే సమయానికి ఆవిడ రైల్వే ట్రాక్ డేట్ సమయంలో ఓ రైలు వేగంగా వచ్చి ఆమె ప్రాణాలను బలికొంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫొటోస్ వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో పట్టాలకు అటువైపు నుంచి ఇటు వైపు వెళ్లడానికి అక్కడికి వచ్చిన వాహనదారులు ట్రైన్ ఎప్పుడు వచ్చి వెళ్తుందని ఎదురుచూస్తున్నారు.అయితే ఎంతకీ రైలు రాకపోవడంతో అంతలోనే ఓ మహిళ ట్రైన్ పట్టించుకోకుండా పట్టాలు దాటడం చేసింది.

రైల్వే గేట్లు దాటే సమయంలో చెవులకు ఇయర్ ఫోన్స్, చేతికి బ్యాగ్ వేసుకొని రైల్వే గేట్లను దాటి దూసుకపోయింది.ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా ఆమెకు బయటివైపు ఎలాంటి సౌండ్ వినిపించకడంతో ఈ దుర్ఘటన జరిగింది.

రైల్వే క్రాస్ లో మొత్తం మూడు రైలు పట్టాలు ఉండగా మొదటి రెండు రైలు పట్టాలను బాగానే దాటిన 3 రైల్వే ట్రాక్ దాటేటప్పుడు ట్రాక్ పై వచ్చే రైలు ను వస్తుందో లేదో అని గమనించకుండా దాటడానికి ప్రయత్నించింది.ఆ సమయంలో మూడో రైల్వే ట్రాక్ పై ట్రైన్ అతివేగంతో వెళ్తోంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..

ఆమె ట్రాక్ పై రావడాన్ని గమనించిన ట్రైన్ లోకో పైలెట్ కూడా హారన్ కొట్టిన కూడా ఆవిడ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఆవిడకు ఆ సౌండ్ వినిపించలేదు.ఇంకేముంది ఆ రైలు వచ్చి ఢీ కొట్టింది.

Advertisement

దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తాజా వార్తలు