రోలర్ రఘుకి డైరెక్టర్ వి వి వినాయక్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

కమెడియన్ రోలర్ రఘు(Roller Raghu) గురించి మందరికి తెలిసిందే ఈయన చేసే యాక్టింగ్ చాలా ఫన్నీ గా ఉంటుంది అలాగే ఆయన కామెడీ విలన్ గా కూడా చేస్తాడు.

అప్పట్లో జబర్దస్త్ షో లోకి కూడా వచ్చి టీమ్ లీడర్ గా ఉంటూనే మంచి కామెడీ స్కిట్లు చేస్తూ ఉండేవాడు, అయినప్పటికీ ఆయన జబర్దస్త్ లో ఎక్కువ రోజులు కొనసాగలేక పోయాడు.

అయితే రఘు సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ వి వి వినాయక్ గారు.వినాయక్ కి రఘు కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే వినాయక్ డైరెక్టర్ అవ్వకముందు రఘు ఉంటున్న అపార్ట్మెంట్ లో రఘు వాళ్ల కింది ఫ్లాట్ లో ఉండేవాడట.

ఆ రూమ్ లో వినాయక్ తో పాటు సురేందర్ రెడ్డి (Surender Reddy)కూడా ఉండేవాడట అప్పుడు రఘు కి వీళ్లిద్దరూ పరిచయం అయ్యారు కానీ రఘు కి అప్పుడు సినిమాలు అంటే ఏంటో కూడా పెద్దగా ఐడియా లేదట.

ఆయన సాఫ్టువేర్ జాబ్ చేస్తూ ఉండేవాడట అయితే ఒక రోజు వినాయక్(VV Vinayak) డైరెక్షన్ చేస్తున్న ఆది సినిమా(Aadi movie) లో చిన్న కామెడీ విలన్ పాత్ర చేయించాడానికి రఘు ని పిలిపించాడట వినాయక్ కానీ రఘు కి ఇంతకు ముందు అసలు యాక్టింగ్ టచ్ లేకపోవడం తో కెమెరా ముందు ఏం చేయాలి అనే చిన్న విషయాలు కూడా తెలియవట అందుకే వినాయక్ ఏం చెప్తే అది చేసేవాడట అలా ఆది సినిమాలో నాకేం తక్కువ అన్న నేను మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తా అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు వినాయక్, సురేందర్ రెడీ సినిమాల్లో ఎక్కువ గా కనిపిస్తూ ఉంటాడు.ప్రస్తుతం రఘు ఇటు సినిమాలు చేస్తూనే అటు బిజినెస్ లు కూడా చేస్తున్నాడు.మొన్న ఈ మధ్య ఒక కొత్త ఇల్లు కూడా కొన్నట్లు తెలుస్తుంది.

Advertisement
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

తాజా వార్తలు