ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గాలనే అతి ఉత్సాహంతో డైటింగ్ల పేరుతో శరారినికి సరిపడా ఆహారం అందించడమే మానేస్తున్నారు.అయితే అతిగా తినడం ఎంత ప్రమాదమో.
శరీరానికి తగినంత ఆహరం అందించకపోవడం కూడా అంతే ప్రమాదమని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు.అసలు తక్కువ ఆహారం ఎందుకు తీసుకోరాదు.? తక్కవ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే ప్రధాన సమస్యలు ఏంటీ.? అన్న విషయాలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి సరిపడా ఆహారాన్ని అందించడం లేదూ అంటే సరిపడా పోషకాలూ అందవు.దాంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చిన్న చిన్న పనులకే ఆలసిపోతుంటారు.నీరసం అధికంగా ఉంటుంది.
శరీరం రోజంతా యాక్టివ్గా ఉండాలంటే కేలరీలో ఎంతో అవసరం.ఆహారం సరిగ్గా తీసుకోకుంటే కేలరీలు శరీరానికి అందవు.
అందు వల్లే నీరసం, ఆలసట వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.మరియు పనిపై ఏక్రాత లోపించడం, ఆలోచన శక్తి తగ్గడం వంటివి కూడా జరుగుతాయి.
అలాగే శరీరానికి తగినంత ఆహరం అందించకపోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది.దాంతో తరచూ జబ్బుల బారిన పడాల్సి ఉంటుంది.ముఖ్యంగా జలుబు సీజన్తో పని లేకుండా అస్తమానూ వేధిస్తుంది.పైన చెప్పుకున్నట్టు సరిగ్గా ఆహారం తీసుకోపోతే శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు.
దాంతో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది.చర్మ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.
తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో తరచూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.దాంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక శరీరానికి తగినంత ఆహరం అందించకుంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమికి దారి చేస్తుంది.పునరుత్పత్తి వ్యవస్థను మరియు గర్భధారణ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా సరిపడా ఫుడ్ తీసుకోవాలి.