ఆ ఇద్ద‌రి వ‌ల్లే జ‌గ‌న్ ఇబ్బందుల్లో ప‌డ్డారా..?

ఏపీ రాజ‌కీయాల్లో ఆ వ‌ర్గానిదే పై చేయి.ఎన్టీఆర్ హ‌యాం నుంచే వారంతా ఒక్క‌ట‌య్యారు.

ఇక నారా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో వారి హ‌వా మ‌రింత పెరిగిపోయింది.ఒకప్పుడు ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల‌ను శాసించిన వారు.

ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌ంగా ఉన్నారు.టీడీపీకి అతిపెద్ద బ‌లంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం ఇప్పుడు వైసీపీకి షాక్ ఇస్తోంద‌ని తెలుస్తోంది.

ఇప్పుడు క‌మ్మ‌ల‌ను వైసీపీ టార్గెట్ చేస్తోంద‌ని, అందుకని ఆ పార్టీకి తామేంటో నిరూపిస్తామంటూ క‌మ్మ నేత‌లు చెబుతున్నారు.ఇందుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం కూడా తోడ‌వుతోంది.

Advertisement

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్మ‌ వర్గం వారు కూడగట్టుకుని ఒక పార్టీకి ఎప్పుడూ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు.వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత వారు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు.

కొంద‌రు వైసీపీకి స‌పోర్టు చేస్తే మ‌రికొంద‌రేమో టీడీపీకి స‌పోర్టు చేస్తున్నారు.కాగా వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన ఈ రెండున్న‌రేండ్ల‌లో ఎక్కువ‌గా క‌మ్మ‌ల‌ను టార్గెట్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

దీంతో వారంతా కూడా ఇప్పుడు ఏకం అవుతున్నార‌ని తెలుస్తోంది.ఇందులో భాగంగానే వారంతా ఒక్క‌ట‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా చంద్ర‌బాబును వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డాన్ని ఆ వర్గం వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

వైసీపీలో ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నేత‌ల‌తో జ‌గ‌న్ క‌థ మొత్తం న‌డిపిస్తున్నారని.చంద్ర‌బాబును వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డం మంచిది కాదని క‌మ్మ‌లు డిసైడ్ అయిపోయారంట‌.కొడాలి నాని, వల్లభనేని వంశీ చేస్తున్న కామెంట్లు క‌మ్మ‌ల మ‌నోభావాలను దెబ్బ తీస్తున్నాయి.

Advertisement

దీంతో వారు రాబోయే రోజుల్లో వైసీపీకి షాక్ ఇవ్వాల‌ని, టీడీపీని ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిపించుకోవాల‌ని చూస్తున్నారంట‌.ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో క‌మ్మ‌లంతా ఒక్క తాటి మీద‌కు వ‌స్తున్నారు.

ఇది రాబోయే రోజుల్లో వైసీపీకి భారీ షాక్ ఇచ్చే అవ‌కాశం ఉంది.చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

తాజా వార్తలు