వారెవ్వా.ఒక్కదెబ్బకు కోటీశ్వరుడయ్యాడు. ఎలాగంటే?

ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.అలా అదృష్ట లక్ష్మి ఎలా వరిస్తుందో చెప్పలేం.

ఎక్కడో ఉన్న వారిని ఒక్కసారిగా ధనవంతులై పోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం సోషల్ మీడియా పుణ్యాన క్షణాల్లో ఆ వార్తను ఎక్కడ అనే విషయాన్ని క్షణంలో చూడగలుగుతున్నాం.ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం రోజూ ఎన్నో రకాల వస్తువులను కొంటూ ఉంటాం.

అయితే మనం వాటిని సాధారణ వస్తువు అనుకొనే కొంటాం.కాని కొన్ని సార్లు అది మనల్ని కోటీశ్వరుడిని చేసేయొచ్చు.

అచ్చం ఇలాగే ఓ సంఘటన జరిగింది.ఓ వ్యక్తి మార్కెట్లో 2, 536 రూపాయలు పెట్టి పింగాణీ పాత్ర కొన్నాడు.

Advertisement

అయితే దానిని మామూలు పాత్ర గానే భావించిన ఆ వ్యక్తి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఎందుకో అనుమానం వచ్చి స్పెషలిస్టులకు ఆ పింగాణీ గిన్నెకు సంబంధించిన వివరాలు పంపించాడు.అయితే పరీక్షల అనంతరం మూడు కోట్ల ఆరు లక్షలకు పైగా ఉంటుందని చెప్పడంతో ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చూసారా అదృష్టం అతనిని కోటీశ్వరుడిని చేసేసింది.ఆవ గింజ అంత అదృష్టం ఉంటే ఏదైనా జరగవచ్చు అనే దానికి ఇదే నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు