ఆ సీక్వెల్ తప్ప మరేది లేదంటున్న దాస్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన హిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సీక్వెల్‌ను త్వరలోనే తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమా కాకుండా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పాగల్ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఆలస్యమయ్యింది.

కాగా ఈ సినిమాతో పాటు మరో తమిళ రీమేక్ చిత్రంలో విశ్వక్ సేన్ నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాను ప్రస్తుతం హిట్ సీక్వెల్ కోసం మాత్రమే చూస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపాడు.ఇక గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన హిట్ చిత్ర సీక్వెల్ కూడా అంతేస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

Advertisement

ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అటు లాక్‌డౌన్ పూర్తవ్వగానే పాగల్ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టేందుకు ఈ యంగ్ హీరో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది మరి హిట్ సీక్వెల్ చిత్రం ఈ ఏడాదిలో రిలీజ్ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి అనుమానంగానే ఉందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా గతంలో విశ్వక్ సేన్ నటించిన ఫలక్‌నుమా దాస్ చిత్రం కూడా ఈ హీరోకు మంచి పేరును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు