మళ్లీ పెళ్లి చేసుకున్న సుడిగాలి సుధీర్.. అసలేమైందంటే..?

ఈ మధ్య కాలంలో టీఆర్పీ రేటింగ్ లు పెంచుకోవాలనే ఉద్దేశంతో టీవీ ఛానెళ్లు రీల్ జోడీలకు పెళ్లిళ్లు చేస్తున్నాయి.

కొన్ని నెలల క్రితం ఈటీవీ ఛానల్ లో రష్మీ సుధీర్ జోడీకి పెళ్లి జరిగినట్టు ఒక ఈవెంట్ ప్రసారమైన సంగతి తెలిసిందే.

ఆ తరువాత రవికృష్ణ నవ్యస్వామి జోడీకి కూడా పెళ్లి జరిగినట్టు ఒక ఈవెంట్ ప్రసారమైంది.బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరనే సంగతి తెలిసిందే.

రష్మీతో సుధీర్ లవ్ లో ఉన్నాడని ఇప్పటికే చాలాసార్లు వార్తలు వైరల్ అయ్యాయి. సుధీర్, రష్మీ వేర్వేరుగా తమ మధ్య ఏం లేదని క్లారిటీ ఇచ్చినా ఈ వార్తలు వైరల్ కావడం గమనార్హం.

తాజాగా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో మాత్రం రష్మీకి బదులుగా నవ్యస్వామి ఎంట్రీ ఇచ్చారు.సుధీర్ ఇమ్మాన్యుయేల్ తో నవ్య అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పగా ఇమ్మాన్యుయేల్ పెళ్లిచూపుల కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు.

Advertisement

సుధీర్ కు ఏమైనా పాటలు వచ్చా అని రోహిణి అడగగా కనిపించిన వాళ్లనంతా అడిగా అడిగా అని అడుగుతూనే ఉండేవాడని ఇమ్మాన్యుయేల్ చెబుతాడు.కట్నం ఏమిటిస్తారు అని అడగగా శానిటైజర్లు, మాస్కులు ఇస్తామని ఆది చెబుతాడు.నవ్య సుధీర్ ను చూసి పర్లేదు అబ్బాయి బాగానే ఉన్నాడని చెబుతుంది.

ఆ తర్వాత నవ్యస్వామి, సుధీర్ దండలు మార్చుకుంటారు.

రామ్ ప్రసాద్ పెళ్లి మాత్రమే ఉండేది ఫస్ట్ నైట్ ఉండదని ఆ అమ్మాయి వదిలేసిందని సుధీర్ కు చెప్పి షాకిస్తాడు.జంబలకిడిపంబ స్పూఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయగా ఆ స్పూఫ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.జబర్దస్త్ కమెడియన్లు అంతా పాల్గొని స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్కిట్ ఊహించని ట్విస్టులతో సరదాగా సాగిపోవడం గమనార్హం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు