స్టార్ హీరో బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే వదులుకోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడరనే సంగతి తెలిసిందే.బాలయ్యకు జోడీగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఓకే చెబుతారు.
అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సినిమాలో అవకాశం అంటే ఏడ్చేశారని సమాచారం.బాలయ్య సినీ కెరీర్ లో అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలలో చెన్నకేశవరెడ్డి సినిమా ఒకటి.
వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రియ నటించగా మరో హీరోయిన్ గా టబు నటించారు.
బాలయ్య చెల్లి పాత్రలో దేవయాని ఈ సినిమాలో నటించి మెప్పించడం గమనార్హం.అయితే దర్శకుడు వినాయక్ ఈ సినిమాలో బాలయ్య చెల్లి పాత్ర కోసం మొదట లయను సంప్రదించారు.
ఒక ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
లయ రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే మూవీ షూటింగ్ లో ఉండగా ఆమెను కలిసి బాలయ్య చెల్లి పాత్రకు మీ పేరును పరిశీలిస్తున్నామని చెప్పానని వినాయక్ తెలిపారు.అలా చెప్పిన వెంటనే లయ కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయని వినాయక్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత లయ తెలుగు అమ్మాయిలను అక్కాచెల్లెళ్ల పాత్రలకే ఎందుకు అడుగుతారని హీరోయిన్ పాత్రలకు పనికిరారా అని లయ అన్నారని వినాయక్ కామెంట్లు చేశారు.
ఆ తర్వాత నేను లయకు సారీ చెప్పి ఏమీ అనుకోవద్దని చెప్పి ఏడ్చేశానని వినాయక్ తెలిపారు.సినిమాలలో చెల్లి, తల్లి పాత్రలలో నటించే యాక్టర్లను ఎంపిక చేయడం సులువు కాదని వినాయక్ అన్నారు.
వినాయక్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.వినాయక్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.