కూలిన వేదిక .. కిందపడ్డ విజయశాంతి

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది.కాంగ్రెస్ ప్రచార సభలో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.

స్టేజీపై నాయకులంతా కూర్చొని ఉండగా ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి నిలబడి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు.అదే సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలింది.

ఈ ఘటనలో విజయశాంతి వేదికపై నుంచి కింద పడ్డారు.ఘటన జరిగిన సమయంలో వేదికపై విజయశాంతి, భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement
పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు