దృశ్యం 2 కోసం కేరళకి వెళ్ళిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసేశాడు.

ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతుంది.ప్రస్తుతం జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది.మొదటి సినిమాలో నటించిన అందరూ కూడా ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.అయితే దృశ్యం సినిమా షూటింగ్ కేరళ నేటివిటీ కోసం విజయనగరం వెళ్లి అక్కడ షూట్ చేశారు.

Advertisement

సినిమా కథాంశం మొత్తం విజయనగరం బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది.అయితే ఇప్పుడు దృశ్యం 2కి దర్శకుడు మారడంతో జీతూ జోసెఫ్ తనకి అలవాటైన లొకేషన్ లోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు.

ఈ నేపధ్యంలో మలయాళీలో మోహన్ లాల్ తో ఏ లొకేషన్ లో అయితే దృశ్యం 2 తెరకెక్కించారో అదే లొకేషన్ లో తెలుగులో దృశ్యం 2 షూటింగ్ కూడా చేయడానికి డిసైడ్ అయ్యి షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారు.ఈ షెడ్యూల్ తోనే మెజారిటీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది.

దీని తర్వాత సాంగ్స్, మిగిలిన పెండింగ్ సన్నివేశాలు చిత్రీకరించి సినిమాకి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే దృశ్యం 2 సినిమా చేస్తూనే వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 మూవీ కూడా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ కి అనిల్ గ్యాప్ ఇవ్వడంతో వెంకటేష్ దృశ్యం 2 చేసుకుంటూ ఉండగా వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ చేసుకుంటున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు