వెంకీ కుడుముల ఛలో సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ సినిమా హిట్ తో ఒక్కసారిగా ఆయనకు ఫేమ్ వచ్చింది.
తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయనకు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది.వరసగా రెండు సినిమాలు హిట్ అవ్వడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
దీంతో తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భీష్మ సినిమా హిట్ తర్వాత చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి.
వెంకీ కుడుముల ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఒప్పించాడని కూడా టాక్ వచ్చింది.ఆయన చెప్పిన కథ నచ్చడంతో చిరంజీవి కూడా ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తుంది.
అయితే ఆయన ప్రస్తుతం బిజీగా ఉండడంతో వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కు మరొక కథ వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి.వరుణ్ తేజ్ కు కూడా వెంకీ కుడుముల కథ బాగా నచ్చిందని ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాను దసరా నుండి సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని వెంకీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఘని సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఘని సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా సయీ మంజ్రేకర్ నటిస్తుంది.ఈ సినిమాను జులై 30 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఎఫ్ 3 సినిమాలో వరుణ తో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు 27 వ విడుదల కాబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy