స్టార్ హీరోల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న వంశీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఆయన కెరీర్‌లో మంచి బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తనదైన శైలిలో తెరకెక్కించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో వంశీ తన మార్క్‌ను వదిలాడు.ఇక ఈ సినిమా తరువాత మహేష్ వంశీతో మరో సినిమా చేస్తానని గతంలోనే చెప్పాడు.

కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ వంశీ సినిమాను పక్కనబెట్టాడు.దీంతో వంశీ పైడిపల్లి తన నెక్ట్స్ చిత్రాన్ని వేరే హీరోతో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఇప్పటికే ఈ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెంబల్ స్టార్ ప్రభాస్‌లకు వినిపించేందుకు వారి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో త్వరలోనే వారిని స్వయంగా కలిసి తన కథను వారికి వినిపించాలని భావిస్తున్నాడు.

Advertisement

మరి మహేష్ కాదన్న వంశీ స్క్రిప్టుకు చరణ్, ప్రభాస్‌లు ఓకే చెబుతారా అనేది చూడాలి.ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకుని మహేష్‌కు తన సత్తా చాటాలని వంశీ పైడిపల్లి కంకణం కట్టుకున్నాడట.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు