ఇంకా ఒక్కటి కూడా విడుదల కాలేదు... అప్పుడే స్టార్ హీరోలతో ఆఫర్లు...

టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రానికి దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించే మరో అవకాశం దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్నారు.

అయితే ఈ అమ్మడు ప్రస్తుతం నటిస్తున్నటువంటి "ఉప్పెన" చిత్రంలోని "నీ కన్ను నీలి సముద్రం" అనే పాట బాగానే పాపులర్ అయింది.దీంతో దర్శకుడు సూర్య ప్రతాప్ కృతి శెట్టీని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది.ఇప్పటికే కుర్రకారు కూడా ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు.దీంతో ఈ అమ్మడు ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

దీనివల్ల ఉప్పెన చిత్రం ప్రమోషన్స్ కి కూడా ఈ విషయం బాగానే ఉపయోగపడుతుంది. .

Advertisement

తాజా వార్తలు