ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు సస్పెండ్

*నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి* నల్గొండ జిల్లా: డిండి మండలంలోని పలు స్కూళ్ళలో సోమవారం జిల్లా విద్యాధికారి భిక్షపతి అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

డిండి మండలంలోని కందుకూరు, శాంతిగూడెం, బ్రాహ్మణపల్లి, రుద్రాయిగూడెం, వావిల్కోల్, ఎర్రగుంటపల్లి, రమాంతపూర్, సింగరాజుపల్లి, తవక్లాపూర్,డిండి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో తనిఖీలు చేశారు.

వారం రోజుల సెలవులు ముగిసిన తర్వాత కూడా శాంతిగూడెం, బ్రాహ్మణపల్లి పాఠశాలలను తెరవకుండా నిర్లక్ష్యం వహించిన శాంతిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్య,బ్రాహ్మపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు గొడుగు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు.వావిల్కోల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలరాజు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని, విచారణకు ఆదేశించినట్లు డీఈవో తెలిపారు.

కాంట్రాక్ట్ పోస్టింగులపై కాంట్రాక్టర్ వ్యాపారమా...?

Latest Nalgonda News