సముద్రఖని దర్శత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కోసం మాటలను, స్క్రీన్ ప్లే బాధ్యత ను త్రివిక్రమ్ తన భుజాల పైన వేసుకున్నాడు.అయితే త్రివిక్రమ్ సినిమాల్లో అతడి డైలాగ్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆ పని మాత్రం తాను చేయకుండా టాలీవుడ్ లోనే ప్రస్తుతం అత్యంత ఎక్కువ పారితోషకం అందుకుంటున్న డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర కి అప్పగించాడు.ముందు త్రివిక్రమ్ చేయాలని పవన్ కళ్యాణ్ పట్టు బట్టిన కూడా త్రివిక్రమ్ సాయి మాధవ్ బుర్ర గురించి ఒక ముక్క ఎక్కువే చెప్పి ఒప్పించాడు.
ఏ మాటకు ఆ మాట సాయి మాధవ్ బుర్ర రాయడం లో చెయ్యి తిరిగిన రచయిత.అయితే సాయి ఈ సినిమాకు మొత్తం డైాగులన్నీ రాశాక పవన్ కళ్యాణ్ కి తన కన్నా కూడా సాయి ధరమ్ తేజ్ కి వెయిట్ ఎక్కువ అనిపించిందట.ఇంకేం ఉంది త్రివిక్రమ పై గుర్రుమన్నాడు పవన్.అయితే డైలాగ్ లు మొత్తం మార్చి రాయాలని త్రివిక్రమ్ సాయి మాధవ్ బుర్ర నీ అడిగితే అందుకు ఆయన సిద్ధం గా లేడు.
ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఉన్న సాయి తాను మార్చి రాసి ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పాడు.పైగా ఇచ్చిన పారితోషకం కూడా తిరిగి ఇవ్వను అన్నాడట.
దాంతో దండం పెట్టిన త్రివిక్రమ్ డబ్బుల సంగతి పక్కన పెట్టి తన పనులన్నీ కూడా పక్కన పెట్టి డైలాగ్స్ రాసే పనిలో పడ్డాడు.
ఇక ఇక్కడ క్రియేటివ్ రచయితల మధ్య కాస్త వాడి వేడి వాతావరణం ఉన్నప్పటికీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసం తగ్గి మాట్లాడుతాడు.ఇక ఇప్పటి వరకు సాయి మాధవ్ బుర్ర సైతం చాలా మంచి మంచి పంచులను, ప్రసాలను కలిపి అద్భుతమైన డైలాగ్స్ రాయడంలో దిత్తనే.ఇక త్రివిక్రమ్ పేరు చెప్పిన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన సినిమాలతో పాటు సినిమాల్లోని డైలాగ్స్.
ఇక మరి పవన్ కళ్యాణ్ వల్ల ఇరుక్కుపోయిన త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఎలాంటి మాటలను రాస్తాడో చూడాలి.