ఫేస్ బుక్ పరిచయాలు.ప్రేమలు.
ఆ తర్వాత మోసాలు ఇలాంటి ఘటనల గురించి చాలా సార్లు వినే ఉంటారు.అయినా ఫేస్ బుక్ ద్వారా మోసపోయే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
సరికదా మోసపోయే ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.రోజుకో కొత్త మార్గంలో మోసగాళ్లు తమ నైపుణ్యంతో మోసాలు చేస్తూనే ఉన్నారు.
వేరే వారి ఫోటోలతో మభ్య పెడుతుంటారు.తీరా చూస్తే కానీ మోసం గురించి తెలియదు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది.
తాజాగా జరిగిన ఓ ఘటనలో ట్రాన్స్ జెండర్ తనను ఓ మగాడిగా పరిచయం చేసుకుని ఓ మహిళను మోసం చేశాడు.
ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని మహిళను ముగ్గులోకి దింపాడు.తను ఓ సివిల్ ఇంజినీర్ అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు.
ఆ మహిళ తన మాటలకు పడిపోయింది.నాలుగేళ్లుగా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
ఫోన్ లో మెసేజీలు, చాటింగ్ లు, వీడియో కాలింగ్ లు చేసుకుంటున్నారు.తీరా పెళ్లి విషయం వచ్చే సరికి ఆ మహిళ కుటుంబ సభ్యులు అబ్బాయి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
అప్పుడే అసలు విషయం బయట పడింది.తను ఓ ట్రాన్స్ జెండర్ అని గుర్తించారు.
మహిళను మోసం చేసిన కేసులో ఆ ట్రాన్స్ జెండర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఇదంతా కర్ణాటక రాష్ట్రం కన్న జిల్లాలోని విట్ల పట్టణంలో జరిగింది.