మధ్యప్రదేశ్ లోని కట్నీలో విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

కట్నీ నది వద్దకు విహార యాత్రకు వెళ్లిన చిన్నారులు వరద ప్రవాహానికి కొట్టుకునిపోయారు, గర్రా ఘాట్ వద్ద స్నానానికి దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు సమాచారం.

ఘాట్ వద్ద పిల్లల బట్టలు గుర్తించిన తల్లిదండ్రులు అధికారులకు సమాచారం ఇచ్చారు, రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి చిన్నారుల మృతదేహాలును బయటకు తీశారు.తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంత అంతా విషాదం అలుముకుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 

తాజా వార్తలు