రేపు హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా రేపు హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.

ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో సెంట్రల్ జోన్ తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు.

కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్‌లలో ట్రాఫిక్ పూర్తిగా మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.ఇందుకు ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు