హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.హాత్ సే హాత్ జోడో అభియాన్ తో పాటు రేవంత్ పాదయాత్రపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావిస్తోన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు.
కాగా ఈ సమావేశంల రేవంత్ రెడ్డి పాదయాత్రపై సీనియర్ నేతల అభిప్రాయాలను ఠాక్రే తీసుకోనున్నారు.అయితే రేవంత్ రెడ్డి ఒక్కరే పాదయాత్ర చేస్తారా.
లేక సీనియర్లతో కలిసి చేస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.