వెస్టిండీస్ తో జరిగిన వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే..!

ఇప్పటివరకు భారత్-వెస్టిండీస్( India vs WI ) మధ్య 139 వన్డే మ్యాచ్లు జరిగాయి.భారత్ వన్డేలలో వెస్టిండీస్ పై చేయి సాధించింది.

వెస్టిండీస్ జట్టుపై భారత్ 70 మ్యాచ్లు గెలిచింది.వెస్టిండీస్ జట్టు భారత్ పై 63 మ్యాచ్లు గెలిచింది.

ఈ మ్యాచ్లలో భారత ఆటగాళ్లు చెలరేగి అద్భుతమైన పరుగులు చేశారు.వెస్టిండీస్ పై వన్డే మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆ తరువాత స్థానాలలో రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరబ్ గంగూలీ ఉన్నారు.

విరాట్ కోహ్లీ:

కోహ్లీ( Virat Kohli ) 2009 నుండి వెస్టిండీస్ తో 42 వన్డే మ్యాచ్లు ఆడాడు.ఇందులో 41 ఇన్నింగ్స్ లలో 66.50 సగటుతో 2261 పరుగులు చేశాడు.ఇందులో తొమ్మిది సెంచరీలు, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Advertisement

రోహిత్ శర్మ:

రోహిత్ శర్మ( Rohit Sharma ) 2009 నుండి వెస్టిండీస్ తో 36 మ్యాచులు ఆడాడు.ఇందులో 34 ఇన్నింగ్స్ లలో 57.17 సగాటుతో 1601 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు, 12 అర్థ సెంచరీలు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్:

సచిన్ టెండూల్కర్( Sachin ) వెస్టిండీస్ తో 1991 నుంచి 2011 మధ్య 39 వన్డే మ్యాచ్లు ఆడాడు.39 ఇన్నింగ్స్ లలో 52.43 సగటుతో 1573 పరుగులు చేశాడు.ఇందులో నాలుగు సెంచరీలు, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

రాహుల్ ద్రావిడ్:

రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) వెస్టిండీస్ తో 1997 నుంచి 2009 మధ్య 40 మ్యాచ్లు ఆడాడు.38 ఇన్నింగ్స్ లలో 42.12 సగటుతో 1348 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు, ఇది అర్థ సెంచరీలు ఉన్నాయి.

సౌరవ్ గంగూలీ:

గంగూలీ( Sourav Ganguly ) 1992 నుంచి 2007 మధ్య వెస్టిండీస్ తో 27 వన్డేలు ఆడాడు.27 ఇన్నింగ్స్ లలో 47.58 తో సగటు తో 1142 పురుగులు చేశాడు.ఇందులో 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

ఇక తాజాగా జులై 27న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు