టాలీవుడ్ స్టార్ డైరక్టర్ కు కరోనా..?

కరోనా మహమ్మారి ఈసారి సినీ సెలబ్రిటీస్ ను బాగానే ఎటాక్ చేస్తుంది.

ఇప్పటికే బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ లాంటి వారు కరోనా బారిన పడగా లేటెస్ట్ గా స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడి కూడా ఆ లిస్ట్ లో చేరారు.

అనీల్ రావిపుడి f3 షూటింగ్ లో పాల్గొంటున్న టైం లో కొద్దిగా సింటమ్స్ రావడంతో టెస్ట్ చేయించుకోగా ఆయనకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 2 అంటూ సూపర్ హిట్ కొట్టారు వెంకటేష్, వరుణ్ తేజ్.మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తూ వస్తున్న f3 కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంటున్నారు.

అనీల్ రావిపుడికి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలియగానే ఆ చిత్రయూనిట్ షాక్ అయ్యారు.డైరక్టర్ అనీల్ రావిపుడి టీం మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

Advertisement

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత బాగా కనిపిస్తుంది.రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ మళ్లీ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

తగిన జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాలు సూచిస్తున్నా సరే కొందరు ఇప్పటికి నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు