గత రెండేళ్లు కరోనా కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.ఇక సినీ ఇండస్ట్రీకి అయితే కోట్లలో నష్టం వాటిల్లింది.
ఎంతో మంది నిర్మాతలు సినిమాలను ధియేట్రికల్ గా రిలీజ్ చేయకుండా ఓటిటిలో అమ్మేసుకున్నారు.థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితులు లేకపోవడంతో చాలా నష్టాలు వాటిల్లాయి.అయితే ఈ ఏడాది మాత్రం మిగతా ఇండస్ట్రీల కంటే మన ఇండస్ట్రీ కాస్త కోలుకుంది అనే చెప్పాలి.
2022 స్టార్టింగ్ నుండి తెలుగు పరిశ్రమకు బాగానే కలిసి వచ్చింది.మిగతా ఇండస్ట్రీల కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ను మన టాలీవుడ్ అందుకుంది.మరి ఈ ఏడాది తెలుగులో అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ సాధించిన సినిమాలు ఏంటో మీకు తెలుసా.ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ :
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు.ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.నిర్మాతలకు ఈ సినిమా దాదాపు 150 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.
కార్తికేయ :
నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 సూపర్ హిట్ అయ్యింది చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ అందుకుంది.కార్తికేయ 2 నిర్మాతలకు 45.5 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.
బింబిసార :
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా వల్ల నిర్మాతలు దాదాపు 22 కోట్ల లాభాలు పొందారట.
సీతారామం :
ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది.దాదాపు 29 కోట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది.
మేజర్ :
అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా 14 కోట్ల లాభాలు అందించిందట.మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.
డీజే టిల్లు :
ఈ సినిమా నిర్మాతలకు 8 కోట్ల లాభాలు తెచ్చి పెట్టిందట.మన తెలుగు సినిమాలే కాకుండా ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా టాలీవుడ్ లాభాలు అందుకుంది.కన్నడ సినిమా కాంతారా అయితే 25 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.
అలాగే కమల్ హాసన్ విక్రమ్ సినిమా 10 కోట్లు, బాలీవుడ్ బ్రహ్మాస్త్ర 8 కోట్ల ప్రాఫిట్స్ అందించాయి.