అల్లు అర్జున్ కి విలన్ గా టాలీవుడ్ హాట్ యాంకర్...

ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్ అనసూయ బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతోంది.ఒకపక్క పలురకాల షోలు నిర్వహిస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తోంది.

ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు దాదాపుగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.ఇందులోభాగంగా ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న టువంటి ఓ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి లేడీ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఇందులో అసూయ ఓ కార్పొరేట్ కంపెనీ యజమాని పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

 ఈ పాత్రకి  సంబంధించినటువంటి స్క్రిప్టు కూడా దర్శకుడు సుకుమార్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

తొందర్లోనే పలువురు సినీ పెద్దల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంచ్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా అనసూయ సోషల్ మీడియా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది.ఇందులో భాగంగా ఈ మధ్యనే తన ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ, అలాగే తనకు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.అంతేగాక తనపై ఇలాంటి వల్గర్ కామెంట్స్ లో చేసినటువంటి వారిని కచ్చితంగా అరెస్టు చేయిస్తానని కూడా తెలిపిన సంగతి తెలిసిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు