Mangalagiri MLA Alla Ramakrishna Reddy : జగనన్న బాటలోనే నడవాలని మళ్లీ వైసీపీలోకి..: ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Mangalagiri MLA Alla Ramakrishna Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ సీఎం జగన్( CM YS Jagan ) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో జగనన్న బాటలోనే నడవాలని మళ్లీ వైసీపీ( YCP )లో చేరానని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.సీఎంగా జగన్ ఉంటేనే పేదలు, మధ్య తరగతి ప్రజలు బాగుపడతారని చెప్పారు.ఈ క్రమంలోనే మంగళగిరి అభ్యర్థిగా జగన్ ఎవరిని నిలబెట్టినా వైసీపీని గెలిపిస్తామని తెలిపారు.2024 ఎన్నికల్లోనూ బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేశ్( Nara Lokesh ) ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు