ఏపీలో 114 ఎమ్మెల్యే, ఐదు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయ్యారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) తెలిపారు.ఈ క్రమంలోనే అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
మిగిలిన స్థానాలకు అభ్యర్థులు వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు అందించాలని ఈడీ ఆదేశించిందన్న వైఎస్ షర్మిల( YS Sharmila ) ఏపీ సీఎస్ తో నేరుగా మాట్లాడానని పేర్కొన్నారు.ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ విషయంలో సీఎస్ చొరవ తీసుకోవాలని తెలిపారు.డీబీటీ ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని వెల్లడించారు.