రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మాంసాహారం, మద్యం విక్రయాలు బంద్ చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మాంసాహారం , మద్యం విక్రయాలను బంద్ చేయించాలని బిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మహాత్మా గాంధీ జయంతి రోజు రాష్ట్రవ్యాప్తంగా మాంసాహారం , మద్యం విక్రయాలు ఏరకంగా నైతే బందు చేశారో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి రోజున మాంసాహారం , మద్యం విక్రయాలను కూడా వెంటనే రద్దు చేయాలని ఈ మేరకు జీవో వెంటనే జారీ చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొర్రి ప్రమోద్, శ్రీనివాస్ గడ్డం ఆనందం, వార్డు సభ్యులు పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు,.

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌కు కీలక పదవి .. టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు

Latest Rajanna Sircilla News