మృగరాజు సినిమాలోని సింహం కోసం నిర్మాత అన్ని లక్షలు ఖర్చు చేశారా?

ప్రతి హీరో సినీ కెరీర్ లో హిట్ సినిమాలు ఎన్ని ఉంటాయో ఫ్లాప్ సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు హీరోలకు చెడ్డపేరు తెచ్చిపెడతాయి.

గుణశేఖర్ డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన సినిమాలలో మృగరాజు సినిమా కూడా ఒకటి.సిమ్రాన్, సంఘవి, నాగబాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా అడవి బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దేవీ వరప్రసాద్ నిర్మించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.చిరంజీవితో మాత్రమే 6 సినిమాలను దేవీ వరప్రసాద్ నిర్మించారు.

Advertisement

దేవీ వరప్రసాద్ 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో మృగరాజు సినిమాను నిర్మించగా ఒక హాలీవుడ్ సినిమాకు ఇన్పిరేషన్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అడవి మృగాలకు రాజు సింహం కాగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో చిరంజీవి సింహంతో పోరాడాల్సి వచ్చింది.

ఈ సినిమా కోసం ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించిన జాక్ అనే సింహాన్ని ఎన్నుకున్నారు.చిరంజీవి సింహం మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి.ఈ సింహం కోసం నిర్మాత ఏకంగా 67 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.26 రోజుల పాటు చిరంజీవి, జాక్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ సినిమా కోసం చిరంజీవి రోజుకు 20 గంటల చొప్పున కష్టపడ్డారు.

ఈ సినిమాలోని ఛాయ్ చాయ్ సాంగ్ పాపులర్ అయింది.మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాలి బింద్రేకు ఛాన్స్ దక్కగా ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను వదులుకున్నారు.

ఈ సినిమా కోసం చిరంజీవి 150 రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు