గవర్నర్ ను ప్రభుత్వం అవమానించలేదు.. ఎమ్మెల్సీ పల్లా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసని చెప్పారు.

గవర్నర్ తమిళిసైని సర్కార్ ఎప్పుడూ అవమానించలేదని తెలిపారు.గవర్నర్ తనకు తానే అవమానం జరిగిందని అనుకుంటున్నారన్నారు.

గవర్నర్ కు బీజేపీ ప్రోటోకాల్ దొరకదు తప్ప ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోటోకాల్ పాటిస్తోందని వెల్లడించారు.అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదం ముదురుతోన్న విషయం తెలిసిందే.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు