ది ఘోస్ట్ ఓటిటి పార్ట్నర్ లాక్.. ప్రముఖ సంస్థకు సొంతం!

అక్కినేని నాగార్జున ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఒకవైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూనే మరో వైపు సోలో హీరోగా కూడా రాణించాలి అని చూస్తున్నాడు.

ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో కొద్దిసేపు కనిపించి మెరిపించాడు.

ఇందులో కూడా ఈయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు.

ఇక ఇప్పుడు నాగ్ సోలో హీరోగా అదృష్టం పరీక్షించు కోవడానికి ప్రేక్షకుల ముందు వచ్చాడు.నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్ సినిమా ఈ రోజు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా నాగ్ అంతా చుట్టి వస్తూ వరుస ప్రొమోషన్స్ చేసాడు.ఇక ఈ సినిమాపై నాగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ కు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేసాడు.అయితే ఈ రోజు రిలీజ్ అయినా ఈ సినిమా ప్రీమియర్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచిగా స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టు సమాచారం.

ది ఘోస్ట్ సినిమాకు ఓటిటి పార్ట్నర్ ఎవరో అనే విషయం బయటకు వచ్చింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాను ప్రపంచ దిగ్గజ సంస్థ అయినా నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.భారీ ధరకు తెలుగుతో పాటు హిందీ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్టు టాక్.మరి ఇప్పట్లో అయితే ఈ సినిమా ఓటిటిలో రావడం కష్టమే.

Advertisement

అప్పటి వరకు థియేటర్స్ లోనే ఈ సినిమాను ఎంజాయ్ చేయాల్సి ఉంది.ఆ తర్వాతనే ఓటిటి ఎంజాయ్ చేయాలి.

ఇక ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా పుష్కర్ రామ్ మోహన్ రావులు నిర్మించారు.

తాజా వార్తలు