సినిమా టికెట్ల బుకింగ్ కోసం వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం.సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది.సినిమా థియేటర్ లో టికెట్స్ ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టం తరహాలోనే పోర్టల్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఈ తరహా విధానం తమిళనాడులో అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్, కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది.
విధి-విధానాలు అభివృద్ధి అమలు ప్రక్రియ ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మెన్ గా ఎనిమిది మంది అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కో-చైర్మెన్ గా ఐటి విభాగం ముఖ్య కార్యదర్శి, సభ్య కన్వీనర్ గా ఐటి విభాగం ప్రత్యేక కార్యదర్శి, ఈ కమిటీలు సభ్యుల సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణ గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్లు (రెవిన్యూ) ఉంటారు.