అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో( Kalyandurgam ) ఉద్రిక్తత నెలకొంది.ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ, టీడీపీ( YCP , TDP ) వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.

 Tension In Kalyanadurgam, Anantapur District , Kalyandurgam, Anantapur , Ycp ,-TeluguStop.com

ఘర్షణ కాస్తా ముదరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.వైసీపీ ఎన్నికల ప్రచార రథం తాళాలను టీడీపీ వర్గీయులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.

తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.ఈ దాడుల్లో పలువురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాల నేతలను సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube