వాళ్ళకి యాక్టింగ్ రాకున్నా.. కేవలం అది చూసే అవకాశాలు ఇస్తున్నారు...

క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది ఒక్క సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉంటుంది.

 కానీ సినీ నటీనటులను రోజు వెండితెరపై, బుల్లితెరపై చూడడం వల్ల ఎక్కువగా అందరూ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై  ఆసక్తి చూపిస్తుంటారు.

అయితే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే "శిఖరం" అనే ధారావాహిక ద్వారా బుల్లి తెరకి నటిగా పరిచయమైన సీరియల్ హీరోయిన్ వర్షిణి ఆజ్ర గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా తాజాగా వర్షిణి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి సినీ అవకాశాలు ఇవ్వడం లేదంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా ఈ మధ్య ధారావాహికలలో నటించేటువంటి తెలుగు నటీనటులకు ప్రాధాన్యత తగ్గి పోయిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేగాక ఎక్కువగా దర్శకనిర్మాతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నటీనటులను ప్రోత్సహిస్తున్నారని ఈ క్రమంలో వారికి నటన రాకపోయినప్పటికీ కేవలం అందంగా ఉంటే చాలని కొందరు ఆలోచిస్తున్నారని ఇది సరికాదని తెలిపింది.

అలాగే ప్రస్తుతం తాను కూడా తెలుగులో అవకాశాలు లేక తమిళంలో ఓ ధారావాహికలలో నటిస్తున్నానని తెలిపింది.అయితే నటీనటులను ప్రోత్సహించడం మంచి విషయమే అయినప్పటికీ స్థానిక నటీనటులకు మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని తన మనసులో మాటను వ్యక్తం చేసింది.

Advertisement

బుల్లితెర పరిశ్రమలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని కానీ తాను ఎప్పుడూ కూడా ఈ కాస్టింగ్ కోచ్ భారిన పడలేదని తెలిపింది. అంతేగాక తాను షూటింగులకు వెళ్ళినప్పుడు తన తల్లిని వెంటబెట్టుకుని వెళతానని చెప్పుకొచ్చింది.అయితే ఈ మధ్య కాలంలో కొందరు క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పబ్లిసిటీ కోసం మీడియా ముందుకు వస్తున్నారనని  దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని తెలిపింది.

 కాగా ప్రస్తుతం జెమినీ టీవీలో మహాలక్ష్మి అనే ధారావాహికలో నటిస్తున్నానని అలాగే తమిళంలో ని ఓ ప్రముఖ సీరియల్ లో నటిస్తున్నట్లు తెలిపింది.తాను 16 సంవత్సరాలు ఉన్నప్పుడే తెలిసిన వారి ద్వారా శిఖరం సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకున్నానని ఆ విధంగా తన సినీ ప్రస్థానం మొదలైందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు