బిగ్‌బాస్‌ : మనుషులు, రోబోల మద్య ఫైట్‌ హింసాత్మకం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గత రెండు వారాలతో పోల్చితే ఈ వారం రసవత్తరంగా సాగుతోంది.

ఇప్పటికీ ఎలిమినేషన్ ప్రక్రియ విషయంలో ప్రేక్షకులకు మస్తు ఎంటర్టైన్మెంట్ లభించింది.

నిన్నటి నుండి ప్రారంభమైన మనుషులు రోబోల టాస్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తోంది.రెండు టీమ్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మనుషుల టీం మరియు రోబోల టీం ఒకరితో ఒకరు పోటీ పడుతూ నువ్వా నేనా అన్నట్లు గేమ్‌ ఆడుతున్నారు.మనుషుల టీం ముందస్తు జాగ్రత్త తో తమకు కావాల్సిన వస్తువులు తీసుకుని బయటికి వెళ్లారు.

ఇంట్లో ఉన్న రోబోల టీం మాత్రం మనుషులకు ఏం కావాలో అవి ఇచ్చి ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.కానీ మనుషుల టీం మాత్రం రోబోల టీం కు ఛార్జింగ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

Advertisement

మనుషుల టీం కష్టపడుతు తిండి లేకుండా బాత్రూం కూడా వెళ్ళకుండా అక్కడే ఉంటూ రోబోల టీం ఛార్జింగ్ ఒక్కో పాయింట్ చొప్పున తగ్గిస్తూ వస్తున్నారు.ఇప్పటికే ఒక రోబో ను చంపేసిన మనుషుల టీం నేటి ఎపిసోడ్ లో మరో ఇద్దరు రోబోలను కూడా చంపాల్సి ఉంటుంది.

లేటెస్ట్ ఎపిసోడ్ లో టాస్క్‌ మరింత ఆసక్తికరంగా మారడంతో పాటు వయలెన్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్లుగా నిన్న ప్రసారం చేసిన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.ఈ టాస్క్‌ లో విజేతలుగా నిలిచే టీమ్‌ కు ప్రత్యేకంగా లగ్జరీ బడ్జెట్‌ దక్కడంతో పాటు ఈ మొత్తం టాస్క్‌ లో ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారికి కెప్టెన్‌ గా కూడా ఛాన్స్‌ ఉంటుంది.

అందుకే ప్రతి ఒక్కరు కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడుతున్నారు.దాంతో ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ లభిస్తుంది.

మొత్తానికి ఈ తెలుగు బిగ్ బాస్ మూడోవారం లో ఆయిన కాస్త ఆసక్తికరంగా మారింది అంటూ ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు