మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ మంత్రి..!!

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ శివారులో కోకాపేటలో ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లోకి వెళ్లి చిరంజీవితో కలిశారు.

ఇదే సమయంలో డైరెక్టర్ కొరటాల కూడా ఉండటంతో ఆయనతో కూడా మాట్లాడారు.ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసి చిరంజీవికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అంతేకాకుండా చిరంజీవి తో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడం జరిగింది.ఆచార్య సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా మే 13 వ తారీఖు న విడుదల చేస్తున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో స్పష్టం చేయడం జరిగింది.నిన్న విడుదలైన టీజర్ లో చిరంజీవి యాక్షన్ సీన్స్, రామ్ చరణ్ వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

అంతే కాకుండా దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి చిరంజీవి సినిమా కి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు