కొంతమంది మహిళలు అతి చిన్న వయసులోనే అనేక అరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.అలాగే కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న మహిళలు కూడా ఎందరో.
అయితే ఇందులో భాగంగా ఓ బాలిక మహిళలు పడుతున్న ఇబ్బందులకి చక్కటి పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయం తీసుకుంది.ఎన్నో ప్రయత్నాలు చేసిన అనంతరం ఎట్టకేలకు ఆ బాలిక అనుకున్న విజయం సొంతం చేసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ముక్యంగా మూత్రవిసర్జన సమయంలో మహిళలు పడే ఇబ్బందులకు ఒక చక్కటి పరిష్కారం కనుగొని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ బాలిక.
మహిళలు కూడా మూత్రవిసర్జన సమయంలో నిలబడి మూత్రం పోసే లాగా ఒక చక్కటి పరికరాన్ని తయారు చేసింది.అంతే కాకుండా రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ విజ్ఞాన ప్రదర్శన కూడా ఈ బాలిక ఎంపికైనట్లు తెలుస్తుంది.
ఈ పరికరం పేరు పింక్లూ.ప్రస్తుతం ఈ పరికరాన్ని తయారుచేసిన ఈ బాలిక తెలివికి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటుంది.

సంగారెడ్డి జిల్లాకు చెందిన భూమిక అనే బాలిక పదవ తరగతి చదువుతోంది.ఈ తరుణంలో మహిళలు మూత్రవిసర్జన సమయంలో పడే ఇబ్బందులకు చక్కటి పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకోగా ఈ తరుణంలోనే పింక్లూ అనే పరికరాన్ని తయారు చేసే మహిళలు కూర్చోకుండా నిలబడే మూత్రవిసర్జన సులువుగా చేసుకునే సదుపాయం కల్పించింది.ఈ పరికరాన్ని ఇటీవల ఆన్లైన్ లో నిర్వహించిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ పోటీలలో ప్రదర్శనకు మౌనిక ఉంచింది.అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఎంపికయినట్లు ఎంఈఓ బండి కృష్ణ తెలియజేశారు.
ఈ పింక్లూ పరికరాన్ని రూపకల్పన చేసే భాగంలో భూమికకు సైన్స్ టీచర్ అయిన సిద్దేశ్వర్ గైడ్ గా చక్కటి సహకారాన్ని అందించినట్లు సమాచారం.