అంబరాన్నినంటిన గిరిజనొత్సవ సంబురాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా " తెలంగాణ గిరిజనోత్సవం పండుగ"ను రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొప్పగా పండుగ వాతావరణం లో సంబురాలు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా 25 గిరిజన గ్రామ పంచాయితీ లలో తెలంగాణ గిరిజన పండుగను నిర్వహించారు.

డప్పు సప్పుల్లు, గిరిజన నృత్యాలు , పాటలలో గిరిజన ఉత్సవం పండగను తలపించింది.ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేశారని కొనియాడారు.

ప్రతి గ్రామపంచాయతీలో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజనులతో కలిసి శాతం భోజనాలు చేశారువేములవాడ శాసనసభ్యులు చందుర్తి మండలం దేవుని తండా జీపీ లో నిర్వహించిన గిరిజనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News