కరోనాకి వాక్సిన్ వచ్చిన తర్వాతే పెళ్లి అంటున్న తెలుగు హాట్ పిల్ల

సినిమా ఇండస్ట్రీలో బేసిగ్గా తెలుగు అమ్మాయిలు హాట్ గా కనిపించడానికి, ఎక్స్ పోజింగ్ చేయడానికి, గ్లామర్ డ్రెస్సింగ్ కి అంతగా ఆసక్తి చూపించరు అనే విమర్శలు గతంలో వినిపించేవి.

అయితే ఇలాంటి విమర్శలకి తేజస్వీ మదివాడ, శోభిత దూలిపాళ్ళ లాంటి తెలుగు భామలు ఫుల్ స్టాప్ పెట్టేసారు.

వీళ్ళు చేసే ఎక్స్ పోజింగ్, అందాల ప్రదర్శన ముందు బాలీవుడ్ భామలు కూడా ఒక్కోసారి సరిపోరని చెప్పాలి.బోల్డ్ గా నటించడానికి ఈ భామలు అస్సలు సంకోచించరు.

అయితే ఇంత చేస్తున్న ఈ తెలుగు హాట్ భామలకి తెలుగు సినిమాలలో అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.ఇందులో తేజస్వీ మదివాడ తరుచుగా ఫోటోషూట్ లు చేస్తూ తన గ్లామర్ డోస్ ని పరిచయం చేస్తూ ఉంటుంది.

అయితే కెరియర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు సొంతం చేసుకొని తరువాత కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసిన ఈ అమ్మడు ఇమేజ్ ని బిగ్ బాస్ షో మొత్తం దూరం చేసింది అని చెప్పాలి.బిగ్ బాస్ ద్వారా చాలా మంది భామలు అవకాశాలు పెంచుకుంటే తేజస్వీకి అవకాశాలు దూరం అయిపోయాయి.

Advertisement

ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ అమ్మడు ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న సందర్భంగా పెళ్లి గురించి టాపిక్ వచ్చింది.

దీనికి ఈ భామ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది.ఇప్పటి వరకైతే తనకి బాయ్ ఫ్రెండ్స్ లేరని, ఎవరితో లవ్ లో పడలేదని చెప్పిన తేజస్వీ, పెళ్లి మాత్రం కరోనాకి వాక్సిన్ కనుక్కొన్న తర్వాతే అని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు