ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు

ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేసింది.

ఇసుక తవ్వకాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీకి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు.

ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రభుత్వ పెద్దల బినామీలకు దక్కే విధంగా టెండర్లు రూపొందించారని టీడీపీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ఏపీలోని ఇసుక దోపిడీ కోసం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని సీబీఐ, సీవీసీని కోరారు.అదేవిధంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు