పశ్చిమ గోదావరిలో 6 నియోజకవర్గాల టీడీపీ అభ్యర్ధులు ఖరారు!

ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడటంతో అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తుగానే తమ పార్టీ అభ్యర్ధులని ఎంపిక చేసే పని ఇప్పటికే మొదలెట్టారు.

జిల్లాల వారీగా పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ నియోజక వర్గాల పార్టీ అభ్యర్ధులని ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, కృష్ణ జిల్లాలో చాలా వరకు నియోజక వర్గాలకి అభ్యర్ధులని చంద్రబాబు కన్ఫర్మ్ చేసేసారు.ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాపై ద్రుష్టి పెట్టిన చంద్రబాబు ఆ జిల్లాలో ఆరు నియోజక వర్గాలకి అభ్యర్ధులని ఖరారు చేసేసారు.

పులపర్తి రామాంజనేయులు కి భీమవరం టికెట్ కన్ఫర్మ్ చేసిన బాబు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, నరసాపురం నుంచి బండారు మాధవనాయుడు, ఉండి నుంచి శివరామరాజు, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్లని చంద్రబాబు ఖరారు చేసారు.ఇక మిగిలిన నియోజకవర్గాలలో సిట్టింగ్ లని తప్పించి కొత్తవారికి ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!
Advertisement

తాజా వార్తలు